ఆదివారం

విమర్శవల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.ఎందుకంటే విమర్శ నెదుర్కొనేవ్యక్తి ఎప్పుడూఎదురు తిరుగుతాడు.తననితాను సమర్థించుకుంటాడు. విమర్శ ప్రమాదకరమైనది. అది ఒక వ్యక్తి తను ఎంతో జాగ్రత్తగా కాపాడుకునే ఆత్మగౌరవాన్ని గాయపరుస్తుంది.అతని అహంకారాన్ని దెబ్బతీస్తుంది.కోపాన్నిరగిలిస్తుంది. విమర్శ రేకెత్తించే కోపం పనివారిని,కుటుంబసభ్యుల్నీ,స్నేహితుల్నీ కించపరుస్తుంది.అంతేకాక మీరు దేనికైతే వారిని నిందించారో ఆ పరిస్థితిని కూడా చక్కబరచదు.
మీరు విమర్శించడంమాని వాళ్ళని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి.వాళ్ళు చేసేపనులు ఆ విధంగా ఎందుకు చేస్తారో ఆలోచించండి-తెలుసుకొండి.విమర్శించడం కన్నా ఈ పని చేయటంలో లాభమూ,ఆసక్తీ ఉంటాయి.దీనివలన అవతలి వ్యక్తి మీద సానుభూతి కలుగుతుంది. ఓర్పు అలవడుతుంది. దయతో వ్యవహరించడం అలవడుతుంది.
దేవుడు కూడా చివరి రోజు వరకూ,మనిషి మంచి చెడ్డల్ని బేరీజు వెయ్యాలని అనుకోడు!.మరి మీరు ఎందుకా పని చెయ్యటం?.